వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఎప్పుడూ?

రమేష్, పెద్దమందడి మండల మాజీ బీజేపీ అధ్యక్షుడు

వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఎప్పుడూ?

పెద్దమందడి,ఏప్రిల్19(తెలంగాణ ముచ్చట్లు):
 
వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఎప్పుడూ జరుగుతాయో స్పష్టత ఇవ్వాలని పెద్దమందడి బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు.ఇప్పటికే పంట కోత పూర్తి చేసి కల్లాల్లో వడ్లు సిద్ధంగా ఉంచిన రైతులకు 10 దాటినా కొనుగోళ్లు ప్రారంభం కాలేదని ఆయన పేర్కొన్నారు.అకాల వర్షాలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.కల్లాల్లో ఉన్న వడ్లు వర్షాభావం ప్రభావం వల్ల తడిసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆయన కోరారు. ఆలస్యం కొనసాగితే రైతులకు ఆర్థిక నష్టం తప్పదని హెచ్చరించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. జమ్మికుంటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):   కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల్లో ఇసుక అక్రమ రవాణా అదుపు తప్పింది. ఇసుక దొరకడం కష్టంగా మారడంతో...
డంపింగ్ యార్డ్‌పై అగ్గిరాజేసిన నిరసనలు.
హిందూ సమ్మేళనం కోసం జమ్మికుంట రెడీ
రోడ్డు దుస్థితి… ప్రజలకు నరకయాతన 
రోడ్డు విస్తరణతో రోడ్డున పడిన చిరు వ్యాపారులు
భీమదేవరపల్లిలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు,
వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఎప్పుడూ?