పీచర గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు
Views: 1
On
వేలేరు, ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
వేసవి ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో వేలేరు మండలం పీచర గ్రామంలో ప్రజలకు మరియు ప్రయాణికులకు ఉపశమనం కలిగించే చర్యగా గ్రామ పంచాయతీ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఎండల నుండి ఉపశమనం కలిగిస్తూ చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే ఎండల కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, కార్యదర్శి తోట అనిల్, వార్డు సభ్యులు జల్తారీ సుకన్య, ఓద్దుల శ్రీకాంత్, జేరుపోతుల జగన్, కొలిపాక వెంకటేష్, పురమణి కవిత, ఉప్పుల శ్రీధర్ రెడ్డి, గుడికందుల రాకేష్, గుండెల్లి సౌజన్య, ఎడ్ల అశ్విని, రామంచ ప్రశాంత్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2026 21:17:30
వనపర్తి,ఏప్రిల్18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణం 29వ వార్డుకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం ఎస్.శ్రీనివాసరావును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన...


Comments