ఉపాధి పనుల్లో భద్రత లేకపోవడంతో కూలీలకు ప్రమాదం.

ప్రభుత్వ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

ఉపాధి పనుల్లో భద్రత లేకపోవడంతో కూలీలకు ప్రమాదం.

ఎల్కతుర్తి, ఏప్రిల్ 16( తెలంగాణ ముచ్చట్లు):

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సురారం గ్రామంలో గురువారం ఉపాధి హామీ పనులు కొనసాగుతున్న సమయంలో జరిగిన ప్రమాదం కలకలం రేపింది. పనులు చేస్తుండగా నలుగురు కూలీలకు కంటి తీగలు  కుట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బాధితుల్లో కోరె అయిలయ్య, ఎంజాల వెంకటయ్యతో పాటు మరికొందరు కూలీలు ఉన్నారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వేగంగా సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కూలీల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉపాధి హామీ పనుల్లో భద్రతా ప్రమాణాలు పూర్తిగా లేవని, కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వకుండా పనులు చేయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కూలీలకు కనీస భద్రత కూడా కల్పించకపోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇకపై ఉపాధి పనులు నిర్వహించే ప్రతి ప్రాంతంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను హెచ్చరిస్తున్నారు.IMG-20260416-WA0086

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆటో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు ఆటో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 16(తెలంగాణ ముచ్చట్లు ) డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని ఇన్స్పెక్టర్ కరుణాకర్...
హుజురాబాద్‌లో ఏప్రిల్ 25న హిందూ స్వర్ణ శంకన సమ్మేళనం.
గ్రంథాలయ సభ్యత్వ మేళా… విద్యార్థుల్లో జ్ఞానవికాసానికి నాంది.
ప్రజాపాలనపై దృష్టి… హుజురాబాద్‌లో మండల స్థాయి సమీక్ష సమావేశం
ఎన్నికల హామీలు అమలు చేయాలి… ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.
జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి రచ్చ… అధికారులపై కాంగ్రెస్ ఫైర్
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం