గ్రంథాలయ సభ్యత్వ మేళా… విద్యార్థుల్లో జ్ఞానవికాసానికి నాంది.

గ్రంథాలయ సభ్యత్వ మేళా… విద్యార్థుల్లో జ్ఞానవికాసానికి నాంది.

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం హుజురాబాద్ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ సభ్యత్వ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథపాలకురాలు కనగలక్ష్మి సమన్వయం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, సమాజ ప్రగతికి జ్ఞాన విస్తరణకు అవి మూల స్తంభాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకుని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆటో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు ఆటో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 16(తెలంగాణ ముచ్చట్లు ) డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని ఇన్స్పెక్టర్ కరుణాకర్...
హుజురాబాద్‌లో ఏప్రిల్ 25న హిందూ స్వర్ణ శంకన సమ్మేళనం.
గ్రంథాలయ సభ్యత్వ మేళా… విద్యార్థుల్లో జ్ఞానవికాసానికి నాంది.
ప్రజాపాలనపై దృష్టి… హుజురాబాద్‌లో మండల స్థాయి సమీక్ష సమావేశం
ఎన్నికల హామీలు అమలు చేయాలి… ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.
జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి రచ్చ… అధికారులపై కాంగ్రెస్ ఫైర్
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం