గ్రంథాలయ సభ్యత్వ మేళా… విద్యార్థుల్లో జ్ఞానవికాసానికి నాంది.
Views: 3
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం హుజురాబాద్ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ సభ్యత్వ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథపాలకురాలు కనగలక్ష్మి సమన్వయం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, సమాజ ప్రగతికి జ్ఞాన విస్తరణకు అవి మూల స్తంభాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకుని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 Apr 2026 22:19:12
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 16(తెలంగాణ ముచ్చట్లు )
డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని ఇన్స్పెక్టర్ కరుణాకర్...


Comments