ప్రజాపాలనపై దృష్టి… హుజురాబాద్లో మండల స్థాయి సమీక్ష సమావేశం
Views: 4
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ కేసి కార్యాలయంలోని రైతు వేదికలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) శ్రీధర్, ఆర్డీఓ రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
అదేవిధంగా గ్రామస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించి, సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
20 Apr 2026 22:18:43
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు )
స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం నగరంలోని...


Comments