జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం.

జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం.

_పనికి వెళ్లి వచ్చిన తర్వాత బయటకు వెళ్లి కనిపించని ప్రశాంత్… 

_మిస్సింగ్ కేసు నమోదు

జవహార్ నగర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా జవహార్ నగర్ పరిధిలో యువకుడు అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. అరుంధతి నగర్‌కు చెందిన సుజాత, రాంబాబు దంపతుల పెద్ద కుమారుడు ప్రశాంత్ (24) కార్మికుడిగా పనిచేస్తున్నాడు.ఏప్రిల్ 5వ తేదీన ఉదయం పనికి వెళ్లిన ప్రశాంత్, సాయంత్రం సుమారు 6:30 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అనంతరం బయటకు వెళ్లొస్తానని చెప్పి తన బైక్‌పై వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. రాత్రి 10 గంటలకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌గా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.తరువాత బంధువుల ఇళ్లలో, పరిచయస్తుల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి సుజాత ఫిర్యాదు మేరకు జవహార్ నగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ప్రశాంత్ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం. జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం.
_పనికి వెళ్లి వచ్చిన తర్వాత బయటకు వెళ్లి కనిపించని ప్రశాంత్…  _మిస్సింగ్ కేసు నమోదు జవహార్ నగర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు) మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా జవహార్...
కమిషన్ల కోసమే గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్.
బాలాజీ నగర్ లో ఆటో డ్రైవర్ అదృశ్యం
వనపర్తి ఎమ్మెల్యే చేతుల మీదగా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
మోజర్లలో చలివేంద్రం ప్రారంభం.
ఈసీ నగర్‌లో సెల్ టవర్ వివాదం ఉద్రిక్తతకు దారి
జవహార్ నగర్ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్