ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ

ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ

- శంకుస్థాపన చేసిన తుంబూరు దయాకర్ రెడ్డి*

- కైకొండాయిగూడెంలో ఆధ్యాత్మిక కోలాహలం*

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు)

ఖమ్మం నగరం ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలో వెలిసిన ముత్యాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు.  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

*శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు..*
ప్రముఖ వేద పండితుడు బాదంపూడి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తి కావాలని, ఈ ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పురోహితులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగటి శ్రీను, నాగటి ఉపేందర్, తుళ్లూరి మాధవరావు - కోటేశ్వరి దంపతులు, మద్దినేని ప్రసాద్, ఆళ్ల రమేష్, గద్దల నాగేశ్వరరావు, గద్దల చిన్నప్ప, తుళ్లూరి కృష్ణయ్య, కొల్పు వెంకటేశ్వర్లు, పందుల తిరుపతిరావు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు) కల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ ప్రెస్ మీట్‌తో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై...
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం భారీ స్థాయిలో సంబరాలు
పీపుల్స్ మార్చ్ మూడేళ్ల సభకు ఖమ్మం నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
ప్రజలకు అందించిన నిర్విరామ సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు...
వేలేరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ
ప్రమాదకరంగా మారిన పీచర మూలమలుపు – వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్