పెద్ద చెర్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం
_500 మందికి పైగా ప్రజలకు పరీక్షలు
– ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చర్లపల్లి, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చెర్లపల్లి బస్ స్టాప్ వద్ద నాయకుడు కడియాల పోచయ్య జ్ఞాపకార్థం అపోలో వైద్యశాల సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చర్లపల్లి అభివృద్ధికి కడియాల పోచయ్య చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని సూచించారు.ఈ శిబిరంలో 500 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.కార్యక్రమంలో మల్కాజ్గిరి అదనపు కమిషనర్ వెంకటరమణ, చైర్మన్ గోవింద్ రెడ్డి, మాజీ చైర్మన్లు హరీష్ రెడ్డి, రోషి రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పావని మణిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments