10వ వార్డులో కోతుల బెడదకు చెక్.!

10వ వార్డులో కోతుల బెడదకు చెక్.!

- కౌన్సిలర్ దేవ జ్యోతి చర్యలు ఫలితం.
- కోతుల పట్టివేత, అటవీ ప్రాంతానికి తరలింపు.

సత్తుపల్లి, ఏప్రిల్  5 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కొంతకాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కోతులు గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు ఇళ్లలోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వార్డు కౌన్సిలర్ దేవ జ్యోతి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, మున్సిపల్ చైర్‌పర్సన్ రిహన కమల్ పాషా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, కోతుల సమస్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారి మార్గదర్శకత్వంలో మున్సిపాలిటీ ప్రత్యేక కోతి పట్టే బృందాన్ని రంగంలోకి దించింది. శనివారం వార్డులోని పలు వీధుల్లో గాలింపు చేపట్టిన బృందం చాకచక్యంగా కోతులను పట్టుకుని బోన్లలో బంధించింది. పట్టుబడిన కోతులను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేయనున్నట్లు అధికారులు తెలిపారు. చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్య నుంచి విముక్తి కలగడంతో వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 05 (తెలంగాణ ముచ్చట్లు): హుజరాబాద్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రెవరెండ్ ఈసంపల్లి జాన్...
సామాజిక న్యాయానికి శాశ్వత దీప్తి బాబు జగ్జీవన్ రామ్ – హుజురాబాద్‌లో ఘన నివాళులు
ఈసీఐఎల్ చౌరస్తాలో భ్రమరాంబ ఫుడ్ కోర్ట్ ప్రారంభం
యాదవ సంఘం కమ్యూనిటీ హాల్‌కు రూ.22 లక్షలు నిధులు మంజూరు
డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కాప్రాలో రూ.20 లక్షలతో ఓపెన్ జిమ్, చిన్నారుల పార్కు ప్రారంభం
నాగార్జున నగర్‌లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఏర్పాటు