డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
_జ్ఞానమాల టీం ఆధ్వర్యంలో 201వ వారం జ్ఞానమాల కార్యక్రమం
– మహనీయులకు పూలమాలలతో నివాళులు
కాప్రా, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా మండల్ పరిధిలోని జమ్మిగడ్డ బి.జె.ఆర్ కాలనీలో జ్ఞానమాల టీం ఆధ్వర్యంలో 201వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే, డా. బి.ఆర్ అంబేద్కర్ మరియు డా. బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.డా. బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారత మాజీ ఉప ప్రధానిగా ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని జ్ఞానమాల టీం ఆర్గనైజర్ తాడూరి గగన్ కుమార్, సలహాదారులు ఎస్.ఏ. రహీం, కోఆర్డినేటర్ నర్సింహ్మ చారి సమన్వయం చేశారు.ఈ వేడుకలో బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పావని మణిపాల్ రెడ్డి, అలాగే వివిధ పార్టీల నాయకులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. స్ఫూర్తి గ్రూప్ సభ్యులు, బి.జె.ఆర్ కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ సమాజ సేవలో ముందుండాలని పాల్గొన్నవారు సంకల్పం వ్యక్తం చేశారు.


Comments