ఈసీఐఎల్ చౌరస్తాలో భ్రమరాంబ ఫుడ్ కోర్ట్ ప్రారంభం
_యువత వ్యాపారాల్లో ముందుండాలి
– నాణ్యతా సేవలపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టి
కుషాయిగూడ, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లోని ఈసీఐఎల్ చౌరస్తాలో భ్రమరాంబ ఫుడ్ కోర్ట్ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముందుండాలని, ముఖ్యంగా వ్యాపార రంగంలో నాణ్యతా ప్రమాణాలను పాటించడం ఎంతో ముఖ్యమని సూచించారు.ఫుడ్ కోర్ట్ వంటి వ్యాపార కేంద్రాలు వినియోగదారులకు పరిశుభ్రతతో కూడిన రుచికరమైన ఆహారం అందించాలని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం ద్వారా వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు సాయి దంపతులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాసం మైపాల్ రెడ్డి, కుమారస్వామి, పాండాల శివకుమార్ గౌడ్, రహీం, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకులు రేగళ్ల సతీష్ రెడ్డి, పోలూరి నాగార్జున, పిల్లి సాయిరాం, మల్లికార్జునరావు, కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.


Comments