శాంతి విల్లే కాలనీలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

శాంతి విల్లే కాలనీలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

కాప్రా, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గంకాప్రా సర్కిల్ డివిజన్ పరిధిలోని శాంతి విల్లే కాలనీలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల అభివృద్ధి తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం ద్వారా రవాణా సమస్యలు తగ్గి, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. శాంతి విల్లే కాలనీలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బైరీ నవీన్ గౌడ్, కాలనీ వాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు హుజరాబాద్ సిఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 05 (తెలంగాణ ముచ్చట్లు): హుజరాబాద్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రెవరెండ్ ఈసంపల్లి జాన్...
సామాజిక న్యాయానికి శాశ్వత దీప్తి బాబు జగ్జీవన్ రామ్ – హుజురాబాద్‌లో ఘన నివాళులు
ఈసీఐఎల్ చౌరస్తాలో భ్రమరాంబ ఫుడ్ కోర్ట్ ప్రారంభం
యాదవ సంఘం కమ్యూనిటీ హాల్‌కు రూ.22 లక్షలు నిధులు మంజూరు
డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కాప్రాలో రూ.20 లక్షలతో ఓపెన్ జిమ్, చిన్నారుల పార్కు ప్రారంభం
నాగార్జున నగర్‌లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఏర్పాటు