వేలేరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వేలేరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వేలేరు, ఏప్రిల్ 06 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. బండ తండా, చింతల్ తండా, కమ్మరిపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ.30 లక్షల సీసీ రోడ్డును కూడా ప్రారంభించారు.
రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు పంపిణీ చేసి, సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందజేశారు. మే 31లోగా మొదటి విడత ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.
సాగునీటి సమస్యల పరిష్కారానికి గండి రామారం లిఫ్ట్ పనులు జూన్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు) కల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ ప్రెస్ మీట్‌తో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై...
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం భారీ స్థాయిలో సంబరాలు
పీపుల్స్ మార్చ్ మూడేళ్ల సభకు ఖమ్మం నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
ప్రజలకు అందించిన నిర్విరామ సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు...
వేలేరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ
ప్రమాదకరంగా మారిన పీచర మూలమలుపు – వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్