వేలేరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Views: 1
On
వేలేరు, ఏప్రిల్ 06 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. బండ తండా, చింతల్ తండా, కమ్మరిపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ.30 లక్షల సీసీ రోడ్డును కూడా ప్రారంభించారు.
రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు పంపిణీ చేసి, సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందజేశారు. మే 31లోగా మొదటి విడత ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.
సాగునీటి సమస్యల పరిష్కారానికి గండి రామారం లిఫ్ట్ పనులు జూన్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Apr 2026 19:49:14
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు)
కల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ ప్రెస్ మీట్తో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై...


Comments