హెచ్ఎంటి నగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే బండారి కృషి
_నూతన వెల్ఫేర్ కమిటీ మర్యాదపూర్వక భేటీ
– శాలువాలతో పరస్పర సత్కారం, అభివృద్ధి పనులకు కృతజ్ఞతలు
నాచారం, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూడా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులందరికీ శాలువాలతో సత్కారం చేసి అభినందించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, హెచ్ఎంటి నగర్ చెరువు సుందరీకరణకు రూ.30 కోట్లతో ప్రత్యేక చొరవ తీసుకోవడం, అలాగే ప్రాంతంలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.1.10 కోట్లు మంజూరు చేయించడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంత అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బి. బుచ్చయ్య, ఉపాధ్యక్షుడు ఆర్. యాదగిరి రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. రామ కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి కె. శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి. సమ్రాట్, ఖజాంచి జి. రామరావు, కార్యవర్గ సభ్యులు వి. బాల్ రెడ్డి, పి. నరసింహ రెడ్డి, బి.హెచ్. నారాయణ బాబు, ఎండీ యూసుఫ్, సతీష్ కులకర్ణి మరియు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ పాల్గొన్నారు.


Comments