బాలాజీ నగర్ లో ఆటో డ్రైవర్ అదృశ్యం

బాలాజీ నగర్ లో ఆటో డ్రైవర్ అదృశ్యం

– పోలీసుల దర్యాప్తు ప్రారంభం

_బాలాజీ నగర్ నివాసి చవాన్ జగన్ (50) ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన


జవహార్ నగర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ బాలాజీ నగర్‌కు చెందిన చవాన్ జగన్ (50) అనే ఆటో డ్రైవర్ మిస్సింగ్ అయిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, భార్య మరణించిన తరువాత జగన్ తన నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.ప్రతిరోజు మాదిరిగానే తేదీ 01.04.2026 నాడు ఉదయం ఆటోతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన జగన్, రాత్రి వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుమారుడు కుమార్ తన మేనత్త గీతకు సమాచారం ఇవ్వగా, ఆమె వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువులు, పరిచయస్తుల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అదేవిధంగా జగన్ మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో అనుమానాలు మరింత పెరిగాయి.ఈ నేపథ్యంలో గీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు  జవహార్ నగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగన్ ఆచూకీ కోసం వివిధ కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం. జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం.
_పనికి వెళ్లి వచ్చిన తర్వాత బయటకు వెళ్లి కనిపించని ప్రశాంత్…  _మిస్సింగ్ కేసు నమోదు జవహార్ నగర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు) మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా జవహార్...
కమిషన్ల కోసమే గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్.
బాలాజీ నగర్ లో ఆటో డ్రైవర్ అదృశ్యం
వనపర్తి ఎమ్మెల్యే చేతుల మీదగా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
మోజర్లలో చలివేంద్రం ప్రారంభం.
ఈసీ నగర్‌లో సెల్ టవర్ వివాదం ఉద్రిక్తతకు దారి
జవహార్ నగర్ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్