హుజురాబాద్ మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం…
రైతులకు మద్దతు ధర హామీ
Views: 3
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 20 ( తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ మార్కెట్ యార్డులో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా అధికారులు, వ్యాపారులు వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
20 Apr 2026 22:18:43
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు )
స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం నగరంలోని...


Comments