రైతు రిజిస్ట్రేషన్ లేకుంటే పథకాల నిలిపివేత.

రైతు రిజిస్ట్రేషన్ లేకుంటే పథకాల నిలిపివేత.

- పీఎం కిసాన్, ఎరువుల సరఫరాపై ప్రభావం.
- ఏఓ ఎస్ .చంద్రశేఖర్ రెడ్డి. 

దమ్మపేట, ఏప్రిల్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

మండలంలోని రైతులు తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సూచించారు. మండలంలో మొత్తం 11,200 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 8,200 మంది మాత్రమే నమోదు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా సుమారు 3,100 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని పేర్కొన్నారు.
రైతు రిజిస్ట్రేషన్ లేకుంటే పీఎం కిసాన్, ఎరువుల సరఫరా తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎక్కువగా నమోదు చేయించుకోలేదని తెలిపారు. అలాంటి రైతులు తమకు సమీపంలోని మీసేవ కేంద్రాలు, సిఎస్‌సి సెంటర్లు లేదా వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. మిగిలిన రైతులందరూ ఆలస్యం చేయకుండా రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని మండల వ్యవసాయ అధికారి విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటిపాములలో ఇంటర్ విద్యార్థుల ఘన సన్మానం. తాటిపాములలో ఇంటర్ విద్యార్థుల ఘన సన్మానం.
వనపర్తి,ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు):  వనపర్తి జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా...
ఆగారం గ్రామంలో జల మహోత్సవం నిర్వహణ.
రైతు రిజిస్ట్రేషన్ లేకుంటే పథకాల నిలిపివేత.
ఉపాధి కూలీల ఆందోళన.!
అశ్వారావుపేటలో “కలికలు” పుస్తకావిష్కరణ.
జమ్మికుంటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.
డంపింగ్ యార్డ్‌పై అగ్గిరాజేసిన నిరసనలు.