అశ్వారావుపేటలో “కలికలు” పుస్తకావిష్కరణ.

లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ.

అశ్వారావుపేటలో “కలికలు” పుస్తకావిష్కరణ.

అశ్వారావుపేట, ఏప్రిల్‌ 20 (తెలంగాణ ముచ్చట్లు):

నియోజకవర్గ కేంద్రంలో విద్యా అభివృద్ధికి మరో ముందడుగు పడింది. స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన “కలికలు” పుస్తకాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆవిష్కరించారు. తదుపరి ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర వైద్య చికిత్సల సమయంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన వారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ప్రభుత్వానికి ప్రాధాన్యమని, త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, తుమ్మా రాంబాబు, జూపల్లి ప్రమోద్, కోలా లక్ష్మీనారాయణ, ఎంఈఓ ప్రసాదరావు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు హరిత, షహీనాబేగం, కొండలరావు, వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.IMG-20260420-WA0067

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటిపాములలో ఇంటర్ విద్యార్థుల ఘన సన్మానం. తాటిపాములలో ఇంటర్ విద్యార్థుల ఘన సన్మానం.
వనపర్తి,ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు):  వనపర్తి జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా...
ఆగారం గ్రామంలో జల మహోత్సవం నిర్వహణ.
రైతు రిజిస్ట్రేషన్ లేకుంటే పథకాల నిలిపివేత.
ఉపాధి కూలీల ఆందోళన.!
అశ్వారావుపేటలో “కలికలు” పుస్తకావిష్కరణ.
జమ్మికుంటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.
డంపింగ్ యార్డ్‌పై అగ్గిరాజేసిన నిరసనలు.