హుజురాబాద్‌లో విషాదం… కాకతీయ కాలువలో ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు

హుజురాబాద్‌లో విషాదం… కాకతీయ కాలువలో ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ యువకుడు కాకతీయ కాలువలో గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా బిలోలి మండలం సగరెల్లి గ్రామానికి చెందిన విజయ్ (28)గా గుర్తించారు.
కరీంనగర్ రోడ్డులో ఉన్న కాకతీయ కాలువలో ఈతకు దిగిన విజయ్, నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో అదుపు కోల్పోయి గల్లంతయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం విజయ్ కోసం విస్తృతంగా శోధన కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News