ప్రాణాలపై పంట బరువు.. రోడ్లపై ధాన్యం వల్ల ప్రమాదాలు

జమ్మికుంట, వీణవంకలో హెచ్చరికలు లెక్కచేయని పరిస్థితి.

ప్రాణాలపై పంట బరువు.. రోడ్లపై ధాన్యం వల్ల ప్రమాదాలు

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల్లో రహదారులు ప్రమాదాల కేంద్రమవుతున్నాయి. పంట చేతికొచ్చిన రైతులు వరిధాన్యం, మక్కను రోడ్లపైనే ఆరబెట్టడం వల్ల వాహనదారులు ప్రాణాలతో ఆటలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రోడ్లపై పరచిన ధాన్యం కారణంగా వాహనాలు అదుపుతప్పి స్కిడ్ అవుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకోవడంతో బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
పోలీసులు పలుమార్లు హెచ్చరించినా, జరిమానాలు విధించినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. రైతులు తమ పంటను కాపాడుకునే ప్రయత్నంలో రహదారులనే వేదికగా మార్చడంతో, నిరపరాధ వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పంట పూర్తిగా రాకముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు, బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News