పద్మశాలివాడ అంగన్వాడీకి కౌన్సిలర్ ప్రణీత పర్యటన

పౌష్టికాహారంపై అవగాహన

పద్మశాలివాడ అంగన్వాడీకి కౌన్సిలర్ ప్రణీత పర్యటన

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణంలోని పద్మశాలివాడ 12వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ కౌన్సిలర్ మొలుగు ప్రణీత శనివారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో అందుతున్న సేవలు, పిల్లలకు ఇస్తున్న ఆహారం, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి, సేవల నాణ్యతపై సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు తల్లి-శిశు ఆరోగ్యానికి కీలకమైన వేదికలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పిల్లల ఎదుగుదలకు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు. ప్రతి కుటుంబం ఈ సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

స్థానిక ప్రజలతో కూడా ఆమె మాట్లాడి, అంగన్వాడీ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.IMG-20260411-WA0478

Tags:

Post Your Comments

Comments

Latest News