బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చూపిన మార్గం
హుజురాబాద్లో జయంతి వేడుకలు
Views: 3
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్లో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి చౌరస్తాలో శనివారం జ్యోతిబాపూలే కమిటీ అధ్యక్షుడు చల్లూరి రఘు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, మహాత్మ జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలోని బలహీన వర్గాలు మరియు మహిళలకు విద్య అవసరాన్ని గుర్తించి, వారి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. ఆయన ఆలోచనలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
12 Apr 2026 21:28:45
వేలేరు, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు ఆడబిడ్డ పెళ్లికి అండగా...


Comments