కామ్రేడ్ నూర్జహాన్‌కు సిఐటియు నివాళులు

_కార్మిక హక్కుల కోసం పోరాడిన ధీర మహిళగా ప్రశంసలు

కామ్రేడ్ నూర్జహాన్‌కు సిఐటియు నివాళులు

కీసర, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

కార్మిక ఉద్యమ ప్రముఖ నేత కామ్రేడ్ నూర్జహాన్‌కు సిఐటియు ఆధ్వర్యంలో కీసర మండలంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు, పబ్లిక్ సెక్టార్ రాష్ట్ర నాయకులు సిహెచ్ దేవి రెడ్డి నూర్జహాన్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూర్జహాన్ మరణం కార్మిక వర్గానికి తీరని లోటని అన్నారు. కార్మికులు, కర్షకులు, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీరశాలిగా ఆమెను కొనియాడారు. సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటమే మార్గమని నమ్మి, పాలకులను ధైర్యంగా ఎదిరిస్తూ ఎర్రజెండా చేతబట్టి పోరాడిన వీరవనితగా ఆమెను అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు, మండల నాయకులు చింతకింది అశోక్, వెంకటేశ్వర్లు, వెంకటేష్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News