గ్రామానికి దూరంగా పల్లె ప్రకృతి వనం…
Views: 8
On
వేలేరు, ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం ప్రజలకు ఉపయోగపడకుండా పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్వలాభం కోసం ఈ వనాన్ని గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల
దూరంలో ఏర్పాటు చేయడంతో ప్రజలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.
దూరంలో ఏర్పాటు చేయడంతో ప్రజలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.అంతేకాక, అక్కడ నాటిన చెట్లకు నీళ్లు పట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో అవి ఎండిపోతున్నాయని, ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇతర గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ప్రజలకు, యువతకు ఉపయోగపడేలా ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నప్పటికీ, పీచర గ్రామంలో అయితే ఆ వనం ఎక్కడ ఉందో కూడా చాలామందికి తెలియదని అంటున్నారు.
తక్షణమే పల్లె ప్రకృతి వనాన్ని గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసి, ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments