గ్రామానికి దూరంగా పల్లె ప్రకృతి వనం… 

గ్రామానికి దూరంగా పల్లె ప్రకృతి వనం… 

వేలేరు, ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలం పీచర గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం ప్రజలకు ఉపయోగపడకుండా పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్వలాభం కోసం ఈ వనాన్ని గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్లIMG-20260418-WA0063 దూరంలో ఏర్పాటు చేయడంతో ప్రజలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.
అంతేకాక, అక్కడ నాటిన చెట్లకు నీళ్లు పట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో అవి ఎండిపోతున్నాయని, ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇతర గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ప్రజలకు, యువతకు ఉపయోగపడేలా ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నప్పటికీ, పీచర గ్రామంలో అయితే ఆ వనం ఎక్కడ ఉందో కూడా చాలామందికి తెలియదని అంటున్నారు.
తక్షణమే పల్లె ప్రకృతి వనాన్ని గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసి, ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

గురువుకు గౌరవ వందనం – రిటైర్డ్ హెచ్ఎంను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గురువుకు గౌరవ వందనం – రిటైర్డ్ హెచ్ఎంను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి,ఏప్రిల్18(తెలంగాణ ముచ్చట్లు):   వనపర్తి పట్టణం 29వ వార్డుకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం ఎస్.శ్రీనివాసరావును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన...
గ్రామానికి దూరంగా పల్లె ప్రకృతి వనం… 
పీచర గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు 
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా హుజురాబాద్‌లో బీజేపీ నిరసన
హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో జేఏసీ నూతన కమిటీ ఏర్పాటు.
ప్రజలకు ఉపయోగపడని వైకుంఠదామం .
జనాభా లెక్కలపై ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమం.