రోడ్డు దుస్థితి… ప్రజలకు నరకయాతన 

రోడ్డు దుస్థితి… ప్రజలకు నరకయాతన 

వేలేరు, ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలం పీచర గ్రామంలో రోడ్డు దుస్థితి గ్రామస్తులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. గాంధీ సర్కిల్ నుండి వాటర్ ప్లాంట్ వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో రాకపోకలు కష్టంగా మారాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు రోజూ ఇబ్బందులు పడుతున్నారు.
అదే సమయంలో క్రెషర్ వాహనాల కోసం రోడ్డుపై ప్రతిరోజూ నీరు పోయడంతో బురదగా మారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. దీంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .