రోడ్డు దుస్థితి… ప్రజలకు నరకయాతన
Views: 31
On
వేలేరు, ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో రోడ్డు దుస్థితి గ్రామస్తులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. గాంధీ సర్కిల్ నుండి వాటర్ ప్లాంట్ వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో రాకపోకలు కష్టంగా మారాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు రోజూ ఇబ్బందులు పడుతున్నారు.
అదే సమయంలో క్రెషర్ వాహనాల కోసం రోడ్డుపై ప్రతిరోజూ నీరు పోయడంతో బురదగా మారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. దీంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Apr 2026 21:52:14
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల్లో ఇసుక అక్రమ రవాణా అదుపు తప్పింది. ఇసుక దొరకడం కష్టంగా మారడంతో...


Comments