బాల్యమిత్రుడు మన్నెంకొండ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం.

బాల్యమిత్రుడు మన్నెంకొండ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం.

పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన మన్నెంకొండ అనే వ్యక్తి అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది.2006–2007 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రుడు ఇకలేకపోవడం అతని స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది.ఈ కష్ట సమయంలో అతని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించిన చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి మానవత్వాన్ని చాటుకున్నారు. వారు తమ వంతుగా రూ. 42,000/-ఆర్థిక సహాయాన్ని సమీకరించి, మృతుడి భార్య మరియు పిల్లలకు అందజేశారు.స్నేహితులు మాట్లాడుతూ.. మన స్నేహితుడు ఇక మన మధ్య లేకపోయినా, అతని జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అతని కుటుంబానికి ఈ కష్టకాలంలో తోడుగా నిలవడం మన బాధ్యతగా భావించాం అని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్థులు స్నేహితుల ఈ సేవా భావాన్ని అభినందిస్తూ.. స్నేహబంధం గొప్పతనాన్ని కొనియాడారు.మన్నెంకొండ ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబానికి ధైర్యం కలగాలని అందరూ ప్రార్థించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి. ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి.
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)   వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా...
అంగన్వాడి టీచర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు.
సేవలకు గుర్తింపు – ఇద్దరు ఏఎస్ఐలకు ఉత్తమ సేవ పథకం.
వనపర్తిలో శ్రీ శుభం గ్రూపు కార్యాలయం ప్రారంభం.
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా డి. రవి ప్రసాద్ నియామకం
మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: సిఐటియు పిలుపు
సిర్సపల్లి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీతో వొడితల ప్రణవ్ భేటీ