బాల్యమిత్రుడు మన్నెంకొండ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం.
Views: 4
On
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన మన్నెంకొండ అనే వ్యక్తి అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది.2006–2007 పదో తరగతి బ్యాచ్కు చెందిన బాల్యమిత్రుడు ఇకలేకపోవడం అతని స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది.ఈ కష్ట సమయంలో అతని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించిన చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి మానవత్వాన్ని చాటుకున్నారు. వారు తమ వంతుగా రూ. 42,000/-ఆర్థిక సహాయాన్ని సమీకరించి, మృతుడి భార్య మరియు పిల్లలకు అందజేశారు.స్నేహితులు మాట్లాడుతూ.. మన స్నేహితుడు ఇక మన మధ్య లేకపోయినా, అతని జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అతని కుటుంబానికి ఈ కష్టకాలంలో తోడుగా నిలవడం మన బాధ్యతగా భావించాం అని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్థులు స్నేహితుల ఈ సేవా భావాన్ని అభినందిస్తూ.. స్నేహబంధం గొప్పతనాన్ని కొనియాడారు.మన్నెంకొండ ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబానికి ధైర్యం కలగాలని అందరూ ప్రార్థించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments