వెల్టూర్ పాఠశాలకు పూర్వ విద్యార్థులు కుర్చీల విరాళం.

వెల్టూర్ పాఠశాలకు పూర్వ విద్యార్థులు కుర్చీల విరాళం.

పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు):
 
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్టూర్ లో 1997–98 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ మిత్రబృందం పాఠశాల ఆవరణలో సమావేశమై పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా 6 ఎస్ టైప్ కుర్చీలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివకుమార్, డి నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి మరియు సంజీవ్ టీచర్ మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ మా సహకారం కొనసాగుతుంది అని తెలిపారు. 1997- 98 పదవ తరగతి పూర్వ విద్యార్థుల తరఫున ఈ సహాయం అందజేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం తరఫున హెడ్మాస్టర్ బాణం విష్ణు వారి సేవా భావాన్ని అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పాఠశాల అభివృద్ధికి తోడ్పడటంతో పాటు పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచిందని ఆయన పేర్కొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి. ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి.
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)   వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా...
అంగన్వాడి టీచర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు.
సేవలకు గుర్తింపు – ఇద్దరు ఏఎస్ఐలకు ఉత్తమ సేవ పథకం.
వనపర్తిలో శ్రీ శుభం గ్రూపు కార్యాలయం ప్రారంభం.
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా డి. రవి ప్రసాద్ నియామకం
మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: సిఐటియు పిలుపు
సిర్సపల్లి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీతో వొడితల ప్రణవ్ భేటీ