సేవలకు గుర్తింపు – ఇద్దరు ఏఎస్ఐలకు ఉత్తమ సేవ పథకం.
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం.
Views: 66
On
సత్తుపల్లి, ఏప్రిల్ 21(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న జి. ప్రతాప్ రెడ్డి, టి. ప్రసాదరావు ఏఎస్ఐలకు ప్రభుత్వం ఉత్తమ సేవ పథకాన్ని మంజూరు చేసింది. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా మంగళవారం ఈ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా పురస్కారం అందుకున్న ఏఎస్ఐలను సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి. శ్రీహరి, ఎస్ఐలు ఎస్. వీరప్రసాద్, పి. ప్రదీప్, జి. అశోక్ కుమార్, ఎస్. నాగరాజు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఎన్. శ్రీనివాసరావు తదితర సిబ్బంది అభినందించారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
21 Apr 2026 22:13:18
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా...


Comments