హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో ఉద్రిక్త వాతావరణం.
కార్మికుల నిరసన ఉధృతం.
Views: 3
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ ఆర్టీసీ డిపో వద్ద బుధవారం కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సమ్మె నేపథ్యంలో డిపో నుంచి ప్రైవేట్ బస్సులను బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నించగా, ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిపో ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
“ప్రైవేటీకరణకు వీల్లేదు… మా హక్కులు కాపాడాలి” అంటూ కార్మికులు గట్టిగా నినాదాలు చేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు అక్కడికి చేరుకుని కార్మికులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో కార్మికులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారి తీసింది. కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కార్మిక సంఘాలు తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Apr 2026 18:21:09
- భూమి వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం.
- ఉత్సాహంగా పాల్గొన్న సిబ్బంది, విద్యార్థులు.
సత్తుపల్లి, ఏప్రిల్ 23(తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని బి.గంగారం సాయిస్ఫూర్తి...


Comments