వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.
Views: 2
On
పెద్దమందడి,ఏప్రిల్22(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్, పెద్దమందడి గ్రామాలలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేఘా రెడ్డి, ఎంపీ మల్లురవి మరియు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న సంక్షేమ చర్యలను వివరించారు.రైతులు తమ వరి పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా న్యాయమైన ధరలు అందేలా ఈ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు.మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నిర్వహించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Apr 2026 18:21:09
- భూమి వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం.
- ఉత్సాహంగా పాల్గొన్న సిబ్బంది, విద్యార్థులు.
సత్తుపల్లి, ఏప్రిల్ 23(తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని బి.గంగారం సాయిస్ఫూర్తి...


Comments