పుస్తకం ప్రగతికి మార్గం - శ్రీరంగాపూర్‌లో ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవం.

పుస్తకం ప్రగతికి మార్గం - శ్రీరంగాపూర్‌లో ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవం.

వనపర్తి,ఏప్రిల్23(తెలంగాణ ముచ్చట్లు):
 
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా  శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గురువారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వాహకుడు కన్నయ్య స్వామి, పుస్తక పాఠకులు కూర్మన్న, కురుమూర్తి, కవి రాఘవాచారిలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పుస్తకం ప్రగతికి మార్గమని పేర్కొన్నారు. తల దించుకొని చదివితే సమాజంలో తల ఎత్తుకునేలా చేస్తుందని, పుస్తకాలు మనకు మంచి స్నేహితులని చెప్పారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు.విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని గ్రంథాలయంలో పుస్తకాలు చదవాలని కోరారు. అలాగే బి ఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్, మహాత్మా గాంధీ వంటి మహానుభావులు పుస్తక పఠనంతోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మండల సోషల్ మీడియా కన్వీనర్ పర్వతాలు, కూర్మన్న, కురుమూర్తి, శ్రీను, హరికృష్ణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

వనపర్తిలో ఘనంగా భగీరథ మహర్షి జయంతి. వనపర్తిలో ఘనంగా భగీరథ మహర్షి జయంతి.
వనపర్తి,ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):   కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు భగీరథ మహర్షి అని నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి...
పామిరెడ్డిపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.
కార్మికుల కన్నీళ్లు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అమానుషం.
రోడ్లే మాయం… అక్రమ నిర్మాణాలతో 7వ వార్డు వాసులకు నరకయాతన.
మడిపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
మోజర్ల–మద్దిగట్ల పాఠశాలలో ఉత్తీర్ణత పత్రాల పంపిణీ.
గురుకుల, సైనిక్ పాఠశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం.