జీతం ఇవ్వడం లేదని వాటర్ మెన్ యాదగిరి ఆవేదన- కార్యదర్శి భిన్న వివరణ
Views: 2
On
వేలేరు, ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలోని గుండ్లసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో వాటర్ మెన్గా పని చేస్తున్న యాదగిరి, తనకు 14 నెలలుగా జీతం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి గత 8 సంవత్సరాలుగా ఇదే బాధ్యతలు నిర్వహించగా, ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత రెండు సంవత్సరాలుగా తానే విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపాడు. అయినప్పటికీ గ్రామ సర్పంచ్, అధికారులు జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు.
జీతం అందక కుటుంబ పోషణ కష్టమైందని, తనకు రావాల్సిన మొత్తం చెల్లించి న్యాయం చేయాలని యాదగిరి కోరాడు.ఇదిలా ఉండగా, ఈ విషయంపై వివరణ కోరగా గుండ్లసాగర్ పంచాయతీ కార్యదర్శి స్పందిస్తూ, గత నెలలోనే యాదగిరికి చెక్కు ద్వారా జీతం చెల్లించినట్లు తెలిపారు. యాదగిరి విధులకు హాజరు కావడం లేదని, పలుమార్లు పిలిచినా రానని చెప్పినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Apr 2026 21:51:28
వనపర్తి,ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు భగీరథ మహర్షి అని నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి...


Comments