108లోనే పుట్టిన పాప తల్లి–శిశువు క్షేమం.

108లోనే పుట్టిన పాప తల్లి–శిశువు క్షేమం.

అశ్వరావుపేట, ఏప్రిల్ 24(తెలంగాణ ముచ్చట్లు):
 
అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి గర్భిణికి సురక్షిత ప్రసవం నిర్వహించారు. గుంటిమడుగు గ్రామానికి చెందిన కె. మంగా (22)కు తీవ్ర ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. గ్రావిడా-2 గర్భిణిగా ఉన్న ఆమెకు పూర్తి గర్భకాలం నిండకముందే నొప్పులు ప్రారంభమవడంతో, అంబులెన్స్‌లోనే వైద్య సహాయం అందించారు. బాధితురాలిని ఎడమ వైపుకు పడుకోబెట్టి, అనంతరం లిథోటమీ స్థితిలో ఉంచి ప్రసవానికి సహకరించారు. ఈ క్రమంలో ఆడ శిశువు సురక్షితంగా జన్మించింది. పుట్టిన వెంటనే శిశువు ఏడుస్తూ స్పందించడంతో పాటు ఆరోగ్యంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. శిశువును పొడిగా, వెచ్చగా ఉంచి అవసరమైన ప్రాథమిక చికిత్స అందించారు. శిశువు బరువు 3.01 కిలోలు కాగా, ఏపీజీఏఆర్ స్కోరు 10గా నమోదైంది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సేవలో ఈఎంటీ ఎం. సుహాసిని, పైలట్ ఎం. నాగేంద్ర బాబు పాల్గొన్నారు. పర్యవేక్షణలో డా. మనీష్ ఉన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

ఆత్మబలిదానాలు వద్దు . ఆత్మబలిదానాలు వద్దు .
హక్కుల కోసం పోరాటం చేద్దాం… – ఆర్టీసీ కార్మికులకు దళిత హక్కుల పోరాట సమితి మద్దతు స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు): ఆర్టీసీ కార్మికుల...
ఆయిల్ ఫామ్ పంటతో అధిక లాభాలు
నిరుపేద గిరిజన మహిళ కుటుంబానికి చేయుత.
108లోనే పుట్టిన పాప తల్లి–శిశువు క్షేమం.
బడి బస్సులు భద్రంగా ఉంచండి.!
వనపర్తిలో ఘనంగా భగీరథ మహర్షి జయంతి.
పామిరెడ్డిపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.