ప్రజల హృదయాల్లో నిలిచిన సీఐకి ఘన గౌరవం
Views: 4
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల భద్రత కోసం అంకితభావంతో పని చేసి, గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసిన రూరల్ సీఐ లక్ష్మీనారాయణ బదిలీపై వెళ్తుండటంతో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆయనకు గౌరవార్థం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ రామారావు శాలువాతో సత్కరించి, దేవుని చిత్రపటాన్ని బహుకరించారు. అలాగే శ్రీరాముల వారి కళ్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలను అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగుతూ, సీఐ సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు ప్రశంసలు కురిపించారు.
చైర్మన్ రామారావు మాట్లాడుతూ, సీఐ లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రూరల్ పరిధిలోని అనేక గ్రామాల్లో ఆధునిక సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కృషి చేశారని గుర్తుచేశారు. ఈ చర్యల వల్ల గ్రామాల్లో నేరాలపై నియంత్రణ పెరిగి, ప్రజల్లో భద్రతాభావం పెరిగిందని పేర్కొన్నారు.
అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట పోలీసు వ్యవస్థను అమలు చేసి, ప్రతి గ్రామంలో శాంతి భద్రతలను కాపాడడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ముఖ్యంగా ఇల్లందకుంటలో జరిగిన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీగా భక్తులు పాల్గొన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని అన్నారు.
ఇలాంటి సేవాభావం కలిగిన అధికారి బదిలీపై వెళ్తుండటం స్థానిక ప్రజలకు బాధాకరమని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పరమేష్, కిరణ్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొని సీఐ లక్ష్మీనారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
26 Apr 2026 21:45:06
దమ్మపేట, ఏప్రిల్ 26(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని మారుమూల కొండరెడ్డ్ల గిరిజన గ్రామాలైన పూసుకుంట, కట్కూరులో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో...


Comments