అకాలంలో నిలిచిపోయిన కలం…

పాత్రికేయుడు గన్ను శ్రీనివాస్ మృతి పత్రికా లోకాన్ని కలచివేసింది

అకాలంలో నిలిచిపోయిన కలం…

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
 
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రతిభావంతమైన పాత్రికేయుడు గన్ను శ్రీనివాస్ గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూయడం పత్రికా లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. నిన్నటివరకు కలంతో సమాజ సమస్యలను వెలికి తీసిన ఆయన, ఒక్కసారిగా లేకపోవడం సహచరులను, స్నేహితులను కలచివేసింది.
తక్కువ సమయంలోనే తన ప్రత్యేక శైలితో వార్తలు రాస్తూ పాఠకుల మనసుల్లో స్థానం సంపాదించిన శ్రీనివాస్, నిబద్ధతతో పనిచేసే విలేకరిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల సమస్యలపై స్పష్టమైన స్వరం వినిపిస్తూ, నిజాయితీతో జర్నలిజం చేసిన ఆయన అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటుగా మారింది.
ఈ సందర్భంగా పలువురు నాయకులు, మిత్రులు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. “ఇలాంటి నిబద్ధత కలిగిన పాత్రికేయుడిని కోల్పోవడం ఎంతో బాధాకరం” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
మానవతా దృక్పథంతో డాక్టర్ పంజాల రాజయ్య కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పంజాల రాజయ్య, డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, పోలంపల్లి శ్రీనివాసరెడ్డి, నరేందర్, విజయేందర్ రెడ్డి, గన్ను రవి, గన్ను వినయ్, గన్ను సంపత్ తదితరులు పాల్గొని శ్రీనివాస్‌కు ఘన నివాళులు అర్పించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన. గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.
దమ్మపేట, ఏప్రిల్‌ 26(తెలంగాణ ముచ్చట్లు):   మండలంలోని మారుమూల కొండరెడ్డ్ల గిరిజన గ్రామాలైన పూసుకుంట, కట్కూరులో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో...
హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర ఆపాలి: జక్కని సంజయ్
శుభకార్యాల వేళ ఆయిల్ సంక్షోభం.!
రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎరువుల దుకాణాల బంద్
స్వీయ కథా రచన పోటీల్లో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ 
ప్రపంచ శిల్ప కళా దినోత్సవం సందర్భంగా సాంప్రదాయ శిల్పులకు ఘన సన్మానం
పెట్రోల్ డీజిల్ కొరతపై ఎంపీ వద్దిరాజు స్పందన