గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.
ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన – సమస్యల పరిష్కారానికి హామీ.
Views: 10
On
దమ్మపేట, ఏప్రిల్ 26(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని మారుమూల కొండరెడ్డ్ల గిరిజన గ్రామాలైన పూసుకుంట, కట్కూరులో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి, పురోగతిపై అధికారులకు సూచనలు చేశారు. అలాగే స్థానిక పాఠశాలలో నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ పనులను కూడా ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాట్ల రాజిరెడ్డి, ఉపసర్పంచ్ కోండ్రు బాబురావు, మడకం రాజేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
26 Apr 2026 21:45:06
దమ్మపేట, ఏప్రిల్ 26(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని మారుమూల కొండరెడ్డ్ల గిరిజన గ్రామాలైన పూసుకుంట, కట్కూరులో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో...


Comments