స్వీయ కథా రచన పోటీల్లో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ 

స్వీయ కథా రచన పోటీల్లో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ 

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 26(తెలంగాణ ముచ్చట్లు )
 
తెలంగాణ సాహిత్య అకాడమీ- ఖమ్మం ట్రస్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కథా కార్యశాల స్వీయ కథా రచన పోటీల్లో నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనబరిచారు. జిల్లాస్థాయిలో విద్యార్థుల్లో సృజనాత్మక కథారచనకు సంబంధించిన మెలుకువలు నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఖమ్మంలో శని,  ఆదివారాల్లో నిర్వహించారు.  ఈ స్వీయ కథా రచన పోటీల్లో జిల్లాలోని పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.   నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయానికి చెందిన విద్యార్థులు నున్నా రుషిత, మోదుగుల హాసిని, కణతాల సాయి వర్షిని  ఈ కథ రచన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విజేతలు  ప్రముఖ కథా రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గుర్రం కాంతారావు, ప్రముఖ విద్యావేత్త, ఫెమా రాష్ట్ర కన్వీనర్ మువ్వ శ్రీనివాసరావు, ఐవీ రమణారావు  చేతుల మీదుగా విద్యార్థులు ప్రతిభా పురస్కారం,  బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ బోడేపుడి కిరణ్, ప్రిన్సిపల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన. గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.
దమ్మపేట, ఏప్రిల్‌ 26(తెలంగాణ ముచ్చట్లు):   మండలంలోని మారుమూల కొండరెడ్డ్ల గిరిజన గ్రామాలైన పూసుకుంట, కట్కూరులో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో...
హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర ఆపాలి: జక్కని సంజయ్
శుభకార్యాల వేళ ఆయిల్ సంక్షోభం.!
రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎరువుల దుకాణాల బంద్
స్వీయ కథా రచన పోటీల్లో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ 
ప్రపంచ శిల్ప కళా దినోత్సవం సందర్భంగా సాంప్రదాయ శిల్పులకు ఘన సన్మానం
పెట్రోల్ డీజిల్ కొరతపై ఎంపీ వద్దిరాజు స్పందన