కన్యకా పరమేశ్వరి ఆశయాలు అందరికీ ఆదర్శం

చైర్మన్ ప్రశాంత్ కుమార్

కన్యకా పరమేశ్వరి ఆశయాలు అందరికీ ఆదర్శం

 
IMG-20260426-WA0050
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
 
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా పట్టణంలో భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక హోమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి పట్టు చీరలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తదుపరి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కూడా చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమేకాక, సమాజానికి ఆదర్శంగా నిలిచిన వీరనారి అని కొనియాడారు. అమ్మవారి ఆశయాలు ధర్మం, న్యాయం, సేవ అనే విలువలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.
జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల వారు అమ్మవారి ఆశయ సాధనలో భాగస్వాములై సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బచ్చు మాధవి శివశంకర్, చందరాజు, స్వామిశెట్టి అఖిలాండం రాజేందర్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన. గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.
దమ్మపేట, ఏప్రిల్‌ 26(తెలంగాణ ముచ్చట్లు):   మండలంలోని మారుమూల కొండరెడ్డ్ల గిరిజన గ్రామాలైన పూసుకుంట, కట్కూరులో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో...
హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర ఆపాలి: జక్కని సంజయ్
శుభకార్యాల వేళ ఆయిల్ సంక్షోభం.!
రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎరువుల దుకాణాల బంద్
స్వీయ కథా రచన పోటీల్లో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ 
ప్రపంచ శిల్ప కళా దినోత్సవం సందర్భంగా సాంప్రదాయ శిల్పులకు ఘన సన్మానం
పెట్రోల్ డీజిల్ కొరతపై ఎంపీ వద్దిరాజు స్పందన