హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర ఆపాలి: జక్కని సంజయ్

హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర ఆపాలి: జక్కని సంజయ్

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
 
హుజురాబాద్ ప్రాంతాన్ని చెత్త మైదానంగా మార్చే ప్రయత్నాన్ని వెంటనే నిలిపివేయాలని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. డంపింగ్ యార్డు ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయకపోతే భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం చేపట్టి, అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్లి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
హుజురాబాద్ పట్టణంలోని బీసీ ఆజాది ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ— జనావాసాల మధ్యలో, పచ్చని పంట పొలాల మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో విష వాయువులు, ప్రమాదకర రసాయనాలు విడుదల చేసే ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రజలపై దాడితో సమానమని పేర్కొన్నారు.
హుజురాబాద్‌ను లక్ష్యంగా ఎంచుకోవడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపిస్తూ, ఇలాంటి ప్రాజెక్టులు ప్రజలు నివసించని దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ప్రజలు ఓట్ల కోసం మాత్రమే గుర్తు చేసుకునే వారు కారని, వారి ప్రాణాలకు విలువ లేదనే భావనతో తీసుకునే నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో హుజురాబాద్ ప్రజలు చేసిన త్యాగాలను ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే రోడ్లపై భారీ నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
“ఇది అభివృద్ధి కాదు — నాశనం. ఇది ప్రాజెక్ట్ కాదు — ప్రజలపై విష దాడి” అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. హుజురాబాద్ ప్రజలు మౌనంగా ఉండరని, ప్రజల ఆరోగ్యం మీద రాజకీయం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నారు:
ఈ సమావేశంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు నడిగోటి రమేష్, ప్రధాన కార్యదర్శి మమునూరి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు కొల్లిపాక క్రాంతి కుమార్, ప్రచార కార్యదర్శి పంజాల వెంకటేశ్వర్లు గౌడ్, కందుకూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన. గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.
దమ్మపేట, ఏప్రిల్‌ 26(తెలంగాణ ముచ్చట్లు):   మండలంలోని మారుమూల కొండరెడ్డ్ల గిరిజన గ్రామాలైన పూసుకుంట, కట్కూరులో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో...
హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర ఆపాలి: జక్కని సంజయ్
శుభకార్యాల వేళ ఆయిల్ సంక్షోభం.!
రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎరువుల దుకాణాల బంద్
స్వీయ కథా రచన పోటీల్లో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ 
ప్రపంచ శిల్ప కళా దినోత్సవం సందర్భంగా సాంప్రదాయ శిల్పులకు ఘన సన్మానం
పెట్రోల్ డీజిల్ కొరతపై ఎంపీ వద్దిరాజు స్పందన