గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన.

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన.

దమ్మపేట, మే 7(తెలంగాణ ముచ్చట్లు):

కేంద్ర ప్రభుత్వం పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను నిరసిస్తూ సీపీఎం దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ముద్దులగూడెం గ్రామంలోని ఎన్టీఆర్ రింగ్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.900, వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.3000 వరకు ధరలు పెంచడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మీనారాయణ, గ్రామ కార్యదర్శి చెన్నుపోయిన బ్రహ్మయ్య, నరుకుల వెంకటేశ్వరరావు, కూచిపూడి రవి, ఎస్.కె. నవి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జై పొన్నం నినాదాలతో మారుమోగిన మాలపల్లె. జై పొన్నం నినాదాలతో మారుమోగిన మాలపల్లె.
హుస్నాబాద్. మే 08 (తెలంగాణ ముచ్చట్లు):   హుస్నాబాద్ మండలం మాలపల్లె గ్రామంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను...
తిరిగి బాధ్యతలు చేపట్టిన పెద్దమందడి సింగిల్ విండో పాలకమండలి.
పెద్దమందడి సింగిల్ విండో నూతన సీఈఓ సుధాకర్‌కు ఘన సన్మానం.
జగత్‌పల్లి సర్పంచ్ పెంటన్న యాదవ్‌ను పరామర్శించిన డా. జిల్లెల ఆదిత్యరెడ్డి.
“ప్రజాస్వామ్యాన్ని దాడులతో అణిచేయలేరు”… కాంగ్రెస్ నేత ఆర్‌ఎస్ గౌడ్ ఫైర్.
కోతుల బెడదకు చెక్.. హుజూరాబాద్ ప్రజలకు ఊరట.
పేదరికాన్ని జయించి 'డాక్టర్‌' అయిన చైతన్య సాయి.