గడ్డి కట్టే యంత్రంలో చిక్కుకుని వ్యక్తి దుర్మరణం.

గడ్డి కట్టే యంత్రంలో చిక్కుకుని వ్యక్తి దుర్మరణం.

భీమదేవరపల్లి,ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు)

భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రచ్చ సంపత్ (51) గడ్డి కట్టలు కట్టే యంత్రం (బేలర్‌ మెషిన్‌)లో పని చేస్తుండగా ఈరోజు మధ్యాహ్నం సుమారు 12:30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు యంత్రంలో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యంత్రంలో పనిచేసేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ దుర్ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుడికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి నివాళులు అర్పించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆటో కార్మికుడి మృతితో విషాదం  కుటుంబానికి ఆర్థిక సహాయం. ఆటో కార్మికుడి మృతితో విషాదం  కుటుంబానికి ఆర్థిక సహాయం.
ఎల్కతుర్తి, మే 07( తెలంగాణ ముచ్చట్లు):   హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన ఆటో కార్మికుడు మాచర్ల అశోక్ అనారోగ్యంతో కిడ్నీ ఫెయిల్ కావడంతో...
పంట మార్పిడితో రైతులకు అధిక లాభాలు
రైతులకు కల్టివేటర్లు, డ్రోన్ల పంపిణీ.
రైతులను మోసం చేసిన బీఆర్ఎస్‌కు మాట్లాడే హక్కు లేదు.
శివాజీ ఆశయాలు యువతకు మార్గదర్శకం
లారీలు లేవు… గోదాములు లేవు… రైతుల పంటకు దారి లేదు!
ప్రమాదంతో నష్టపోయిన రైతులకు అండగా ప్రణవ్…