గడ్డి కట్టే యంత్రంలో చిక్కుకుని వ్యక్తి దుర్మరణం.
Views: 3
On
భీమదేవరపల్లి,ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు)
భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రచ్చ సంపత్ (51) గడ్డి కట్టలు కట్టే యంత్రం (బేలర్ మెషిన్)లో పని చేస్తుండగా ఈరోజు మధ్యాహ్నం సుమారు 12:30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు యంత్రంలో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యంత్రంలో పనిచేసేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ దుర్ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుడికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి నివాళులు అర్పించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 May 2026 17:38:11
ఎల్కతుర్తి, మే 07( తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన ఆటో కార్మికుడు మాచర్ల అశోక్ అనారోగ్యంతో కిడ్నీ ఫెయిల్ కావడంతో...


Comments