లేబర్ కార్డు రెన్యువల్ తప్పనిసరి .

ఉప కార్మిక కమిషనర్ కోల ప్రసాద్

లేబర్ కార్డు రెన్యువల్ తప్పనిసరి .

హుజురాబాద్, మే 06(తెలంగాణ ముచ్చట్లు ):
 
కార్మికులు తమ లేబర్ కార్డులను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉప కార్మిక కమిషనర్ కోల ప్రసాద్ సూచించారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో మే డే ఉత్సవాల సందర్భంగా కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందాలంటే లేబర్ కార్డు చెల్లుబాటు ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. గడువు ముగిసిన కార్డులను వెంటనే పునరుద్ధరించుకోవాలని కార్మికులకు సూచించారు.
రెన్యువల్ చేయించుకోని పక్షంలో ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్మికులు తమ సమస్యలను నేరుగా కార్మిక శాఖ అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఇంచార్జ్ కార్మిక శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, మధు, నాయకులు కోయల్కర్ బాలాజీ, సామాజిక కార్యకర్త నలబాల వేణుగోపాల్‌తో పాటు వివిధ సంఘాల కార్మిక నేతలు, కార్మికులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

ఆటో కార్మికుడి మృతితో విషాదం  కుటుంబానికి ఆర్థిక సహాయం. ఆటో కార్మికుడి మృతితో విషాదం  కుటుంబానికి ఆర్థిక సహాయం.
ఎల్కతుర్తి, మే 07( తెలంగాణ ముచ్చట్లు):   హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన ఆటో కార్మికుడు మాచర్ల అశోక్ అనారోగ్యంతో కిడ్నీ ఫెయిల్ కావడంతో...
పంట మార్పిడితో రైతులకు అధిక లాభాలు
రైతులకు కల్టివేటర్లు, డ్రోన్ల పంపిణీ.
రైతులను మోసం చేసిన బీఆర్ఎస్‌కు మాట్లాడే హక్కు లేదు.
శివాజీ ఆశయాలు యువతకు మార్గదర్శకం
లారీలు లేవు… గోదాములు లేవు… రైతుల పంటకు దారి లేదు!
ప్రమాదంతో నష్టపోయిన రైతులకు అండగా ప్రణవ్…