కాషాయ గర్జనతో మారుమోగిన ఎల్కతుర్తి.
Views: 3
On
ఎల్కతుర్తి, మే 04( తెలంగాణ ముచ్చట్లు):
పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ, టపాసులు పేల్చుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసమే ఈ విజయానికి కారణమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే దేశవ్యాప్తంగా బీజేపీకి మద్దతు పెరుగుతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, “మోదీ గారి అభివృద్ధి పథకాలు, అమిత్ షా గారి వ్యూహరచన వల్లనే బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. భవిష్యత్తులో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కుడుతాడు చిరంజీవి, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, వెంకటేష్, జనగాని కిష్టయ్య, ఆడెపు శ్రీవర్ధన్, చిదురాల వెంకటేష్, పల్లెపాటి మధుకర్ రావు, మాజీ సర్పంచ్ కడారి ప్రసాద్, నాంపల్లి అశోక్, పెరుగు మధు, కొడం రమేష్, చెదిరం రాకేష్, ఎర్రోళ్ల రాజు, కొలిపాక శ్రీనివాస్, మాటూరి విద్యాసాగర్, రంజిత్, శ్రీనివాస్, దేవరావు, సుఖినే సుధాకర్ రావు, కోమటిపల్లి నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 17:01:04
ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త...


Comments