వంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
ఏఐకేఎస్ డిమాండ్.
Views: 3
On
ఖమ్మం బ్యూరో, మే 4(తెలంగాణ ముచ్చట్లు )
పాతర్లపాడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో పంట కాలిపోయిన మొక్కజొన్న రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎస్ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు ఏపూరి రవీంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పాతర్లపాడు గ్రామంలో ఏఐకేఎస్ చింతకాని మండల ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఏపూరి రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యంతోనే మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొనుగోలు కేంద్రాల పేరుతో రైతులను దగా చేస్తున్నారన్నారు. బస్తాలు మొదలుకొని, కాటాలు, చివరకు లారీల వరకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వేసవి కాలం కావడంతో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటుంటే రైతులు రాత్రిళ్ళు సైతం కాటాలు వేసిన బస్తాలకు కావిలి కాయల్సివస్తుందన్నారు. కాటాలు వేసిన బస్తాలను గోడౌన్కు తరలించడానికి బస్తాకు రూ.40 నుంచి 50 వరకు డిమాండ్ చేస్తున్నారని దీంతో గత్యంతరం లేక రైతులు చెల్లిస్తున్నారని, పాతర్లపాడులో జరిగిన ప్రమాదంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తక్షణమే అధికారులు పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి పంపి నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. తక్షణమే అధికారులు స్పందించి కాటాలు వేసిన మొక్కజొన్నను గోడౌన్ కు తరలించాలని పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో గొర్రెలు కూడా అగ్నికి ఆహుతయ్యాయని గొర్రెల కాపరికి కూడా నష్టపరిహారం అందేలా చూడాలని లేని పక్షంలో రైతులు తరపున ఏఐకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పావులూరి మల్లిఖార్జునరావు, ఏఐకేఎస్ మండల కార్యదర్శి పదిమల వెంకటనర్సయ్య, నాయకులు తాళ్లూరి యాదగిరి, కొత్తపల్లి రమేష్, గడ్డం సీతారామారావు తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 17:01:04
ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త...


Comments