42 రోజుల పోరాటానికి బ్రేక్…
సిరిసపల్లి డంపింగ్ యార్డ్ ఉద్యమం తాత్కాలిక విరమణ .
Views: 2
On
హుజురాబాద్ మే 3(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిర్సపల్లిలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా గ్రామస్తులు సాగించిన ఉద్యమం 42 రోజుల తర్వాత తాత్కాలికంగా ఆగింది. ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో జేఏసీ నాయకులు నిరాహార దీక్షను విరమించారు.
కాంగ్రెస్ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు విజ్ఞప్తి మేరకు దీక్ష శిబిరాన్ని తొలగించారు. అయితే భవిష్యత్తులో మళ్లీ ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన తీసుకొస్తే భారీ స్థాయిలో ఉద్యమాన్ని పునఃప్రారంభిస్తామని గ్రామస్తులు గట్టిగా హెచ్చరించారు.
ప్రజల ఐక్యత, దీక్షతో సాగిన ఈ పోరాటం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 May 2026 21:14:49
హుజురాబాద్ మే 3(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా...


Comments