హుజురాబాద్‌లో అమరవీరుల స్మారక బ్యారక్ ప్రారంభం .

వీరుల త్యాగాలకు ఘన నివాళి .

 హుజురాబాద్‌లో అమరవీరుల స్మారక బ్యారక్ ప్రారంభం .

హుజురాబాద్, ఏప్రిల్ 29(తెలంగాణ ముచ్చట్లు ):
 
హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్మారక బ్యారక్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమం గంభీర వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. వారి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, వారి త్యాగాల వల్లనే ప్రజలు నేడు ప్రశాంతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.
అమరవీరుల జ్ఞాపకార్థం ఈ స్మారక బ్యారక్ నిర్మాణం పోలీస్ శాఖకు గౌరవకరమైన విషయమని అన్నారు. సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారి పనితీరు మరింత మెరుగుపడి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలరని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో కొనసాగింది.
Tags:

Post Your Comments

Comments

Latest News

బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు. బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు.
    అడ్డాకల్, ఏప్రిల్29(తెలంగాణ ముచ్చట్లు): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలిదుపల్లి గ్రామ మహిళా సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆంజనేయులు
హుజురాబాద్‌లో అమరవీరుల స్మారక బ్యారక్ ప్రారంభం .
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌పై రాజకీయ తుపాన్ .
పదవ తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్ విజయకేతనం.
సీఆర్‌పీలకు బదిలీలు చేపట్టాలి.
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది .
వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయినా...ధాన్యం కొనుగోలు నత్తనడక .