చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది .
మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి.
Views: 2
On
పెద్దమందడి,ఏప్రిల్28(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఐకెపి కేంద్రాల ద్వారా వడ్ల కొనుగోలు కార్యక్రమాన్ని స్థానిక గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వనపర్తి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు.అదేవిధంగా రైతులు తేమశాతం తగ్గే వరకు వడ్లను బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోందన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ సింగిల్ విండో చైర్మన్ సత్యరెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గట్టు యాదవ్, ఏపీఎం సకృ నాయక్, కేంద్ర నిర్వాహకులు శారద, అరుణ, మాధవి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
29 Apr 2026 17:43:44
అడ్డాకల్, ఏప్రిల్29(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలిదుపల్లి గ్రామ మహిళా సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆంజనేయులు


Comments