దేవస్థానం నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం..!

రోడ్డెక్కిన హనుమాన్ భక్తులు.

దేవస్థానం నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం..!

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
 
ఇల్లంతకుంట దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంపై హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇల్లందకొండ చౌరస్తాలో రోడ్డుపై నిరసన చేపట్టారు.
భక్తులు మాట్లాడుతూ, ఆలయంలో కనీస వసతులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని, తాగునీటి వంటి ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, భక్తులపై అదనపు బిల్లులు మోపుతూ అవినీతి జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
దేవస్థానం అధికారులు భక్తుల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించిన భక్తులు, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భక్తులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. సమస్యలను చట్టపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, భక్తులను శాంతింపజేసి నిరసనను విరమింపజేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు. బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు.
    అడ్డాకల్, ఏప్రిల్29(తెలంగాణ ముచ్చట్లు): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలిదుపల్లి గ్రామ మహిళా సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆంజనేయులు
హుజురాబాద్‌లో అమరవీరుల స్మారక బ్యారక్ ప్రారంభం .
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌పై రాజకీయ తుపాన్ .
పదవ తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్ విజయకేతనం.
సీఆర్‌పీలకు బదిలీలు చేపట్టాలి.
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది .
వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయినా...ధాన్యం కొనుగోలు నత్తనడక .