శాలపల్లి గ్రామంలో విషాదం – అందె శ్యామ్ కుటుంబానికి పరామర్శ

శాలపల్లి గ్రామంలో విషాదం – అందె శ్యామ్ కుటుంబానికి పరామర్శ

వేలేరు, ఏప్రిల్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలం శాలపల్లి గ్రామానికి చెందిన అందె శ్యామ్ కుటుంబాన్ని వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ పరామర్శించారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో అందె శ్యామ్ మృతి చెందగా, విషయం తెలుసుకున్న సద్దాం హుస్సేన్ ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వేలేరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, 13వ వార్డు మెంబర్ అక్కల ప్రశాంత్, దామెర అశోక్, కుమార స్వామి, ప్రవీణ్, బబ్లూ, కిషోర్, శ్రీనివాస్, సలీం మాలిక్, గ్రామ పెద్దలు, కుల సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News