పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు.
- నిల్వలపై ఆందోళన అవసరం లేదు: పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
సత్తుపల్లి, ఏప్రిల్ 28(తెలంగాణ ముచ్చట్లు):
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇంధన బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత సృష్టించే చర్యలపై పోలీసు శాఖ నిఘా కొనసాగుతోందన్నారు.
బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఉన్నప్పటికీ లేదని చెప్పడం, అధిక ధరలకు విక్రయించడం వంటి ఘటనలు గమనించినట్లయితే, వెంటనే పౌరసరఫరాల శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అపోహలు నమ్మి ఇంధనాన్ని అధికంగా నిల్వ చేసుకోవద్దని, అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. జిల్లాలో ఇంధన సరఫరా సజావుగా కొనసాగుతోందని, ఎటువంటి అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు.


Comments