పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు.

పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు.

- నిల్వలపై ఆందోళన అవసరం లేదు: పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

సత్తుపల్లి, ఏప్రిల్ 28(తెలంగాణ ముచ్చట్లు):

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇంధన బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత సృష్టించే చర్యలపై పోలీసు శాఖ నిఘా కొనసాగుతోందన్నారు.
బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఉన్నప్పటికీ లేదని చెప్పడం, అధిక ధరలకు విక్రయించడం వంటి ఘటనలు గమనించినట్లయితే, వెంటనే పౌరసరఫరాల శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అపోహలు నమ్మి ఇంధనాన్ని అధికంగా నిల్వ చేసుకోవద్దని, అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. జిల్లాలో ఇంధన సరఫరా సజావుగా కొనసాగుతోందని, ఎటువంటి అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు. బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు.
    అడ్డాకల్, ఏప్రిల్29(తెలంగాణ ముచ్చట్లు): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలిదుపల్లి గ్రామ మహిళా సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆంజనేయులు
హుజురాబాద్‌లో అమరవీరుల స్మారక బ్యారక్ ప్రారంభం .
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌పై రాజకీయ తుపాన్ .
పదవ తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్ విజయకేతనం.
సీఆర్‌పీలకు బదిలీలు చేపట్టాలి.
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది .
వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయినా...ధాన్యం కొనుగోలు నత్తనడక .